ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్టు - విజయనగరం మండలం పినవేమలి గ్రామం క్రైమ్ న్యూస్

విజయనగరం జిల్లాలోని పినవేమలి గ్రామంలో.. ఫిబ్రవరి 18న యువకుని హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధంతోనే.... రవికుమార్​కు బాలిపైడి రాజు అనే వ్యక్తి మద్యం తాగించి.. ఆపై హత్యకు పాల్పడినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఘటనకు పాల్పడిన రాజుతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

పినవేమలిలో దారుణం... యువకుడు దారుణ హత్య
పినవేమలిలో దారుణం... యువకుడు దారుణ హత్య

By

Published : Apr 7, 2021, 4:08 PM IST

ఫిబ్రవరి 18న విజయనగరం జిల్లాలోని పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవికుమార్ (23) హత్య సంచలనం సృష్టించింది. కెంగువ రవికుమార్ అనే వ్యక్తిని పినవేమలి గ్రామ శివారు ప్రాంతంలో చంపి... మృతదేహం కాళ్లకు రాయి కట్టి నూతిలో పడేసిన కేసులో... నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. యువకుడిని కిరాతకంగా హత్యచేశారన్నారు. బాలి పైడిరాజుకు తెలిసిన మహిళతో... రవికుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతోనే హత్య చేసినట్టు గుర్తించామని చెప్పారు.

"ఫిబ్రవరి 17న రవికుమార్.. బాలి పైడిరాజుతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం రవిపై దాడి చేసిన బాలిపైడి రాజు.. చివరికి అంతమొందించాడు. తరువాత నారాయణరావు, సత్యనారాయణ, ఉదయ్ కిరణ్​ సహాయంతో మృతదేహనికి బండరాయిని కట్టి నూతిలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.... దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు" అని ఎస్పీ రాజకుమారి చెప్పారు. ఘటనను ఛేదించిన పోలీసులను అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details