ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం - పార్వతీపురంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం

డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం హర్షనీయమని... మాజీఎమ్మెల్యే చిరంజీవులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

former mla chiranjeevulu pays tribute to ambedkar statue in vizianagaram
అంబేడ్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పాలాభిషేకం

By

Published : May 23, 2020, 10:31 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో దళిత సంఘాల నాయకులతో కలిసి మాజీఎమ్మెల్యే చిరంజీవులు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు... సీబీఐ విచారణకు ఆదేశించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమంజసంగా లేవంటూ హైకోర్టు ఒకే రోజు 3 అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం సరికాదని... అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ జీవోను రద్దు చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మేలు జరిగేలా చూడాలని ఆయన సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details