అగ్నిప్రమాదాలు జరిగినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... ఆస్పత్రిలో మంటలు వ్యాపించినప్పుడు రోగులను ఏ విధంగా బయటకు తీసుకురావాలి.. ప్రాణనష్టం లేకుండా చేపట్టాల్సిన చర్యలేంటో వివరించారు. మంటలను అదుపుచేసే పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు.
అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
పార్వతీపురంలో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలో.. ప్రజలకు అవగాహన కలిగించారు.
అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన