ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం.. 40పూరిళ్లు దగ్ధం - kondavaani palem news

వారంత నిరుపేదలు. కూలికెళ్తె గానీ రోజు గడవదు. అటవీ ఉత్పత్తులు, పోడు వ్యవసాయమే వారికి జీవనాధారం. అలాంటి వారి ఆవాసాలను అగ్గి.. బుగ్గిపాలు చేసింది. పనికి వెళ్లొచ్చే లోపే దావనంలా వ్యాపించి గ్రామాన్ని రావణకాష్ఠలా మార్చింది. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

fire accident
కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం.. 40పూరిళ్లు దగ్ధం

By

Published : Mar 6, 2021, 10:56 AM IST

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 40పూరిళ్లు దగ్ధమవ్వగా... 25లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం సంభవించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

మొదట ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు క్రమేపి ఊరంతా వ్యాపించాయి. ఉదయమే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గ్రామస్థులు సాయంత్రం వచ్చే లోపు ఇళ్లన్నీ కాలి బూడిదపాలయ్యాయి. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి:చెరకు లారీ బోల్తా .. రాకపోకలకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details