విజయనగరం జిల్లా చీపురుపల్లిలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని.. వారందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
రెగ్యులర్ చేయాలంటూ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా - చీపురుపల్లిలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా వార్తలు
సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని.. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కోరారు. వారి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
రెగ్యులర్ చేయాలంటూ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా