ఆంధ్రా - ఒడిశా సరిహద్దు, విజయనగరం జిల్లా కుటియా పరిధిలోని 4 పంచాయతీల్లో మూడు ఏకగ్రీవమయ్యాయి. కానీ పట్టు చెన్నారులో అభ్యర్థులు బరిలో నిలవడంతో.. ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ఎన్నికలు జరగనివ్వమని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఎలా అయినా నిర్వహిస్తామని ఎన్నికల ప్రత్యేక అధికారులు తేల్చిచెప్పారు. ఇక్కడి ప్రజలు ఎన్నికలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారన్నారు. ఆ గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనందున ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అవసరమైతే అదనపు బలగాలనూ ఏర్పాటు చేస్తామన్నారు.
పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమంటున్న ఒడిశా.. జరిపితీరుతామంటున్న ఏపీ... - ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఎన్నికల నిర్వహణ
ఆంధ్రా- ఒడిశా సరిహద్దు, విజయనగరం జిల్లాలోని కుటియా పరిధిలోని 4 పంచాయతీల్లో 3 ఏకగ్రీవం అయ్యాయి. పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఎలా అయినా నిర్వహిస్తామని ఏపీ అధికారులు తేల్చిచెప్పారు. అవసరమైతే అదనపు బలగాలనూ సిద్ధం చేస్తామని వెల్లడించారు.
elections issue
TAGGED:
ఏపీ పంచాయతీ ఎన్నికలు