ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు - లకనాపురంలో యువకులపై బ్లేడుతో దాడి వార్తలు

విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ.. ఐదుగురిని గాయాలపాలు చేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా లకనాపురంలో జరిగింది.

Due to a confrontation between the youths, one man was attacked by another with a blade at vizianagaram
పోలీసుల అదుపులో నిందితులు

By

Published : Jan 2, 2020, 9:26 AM IST

యువకుల మధ్య తగాదా... బ్లేడుతో దాడి

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లకనాపురం, జియ్యమ్మవలస మండలం పెదబుడ్డి గ్రామానికి చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గ్రామాలకు చెందిన కొంతమంది విద్యార్థులు పార్వతీపురంలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. బస్సులో ప్రయాణిస్తుండగా...మాటామాటా పెరిగింది. అదికాస్తా దాడికి దారి తీసింది. పెద్దబుడ్డి గ్రామానికి చెందిన విద్యార్థి... మరో ఇద్దరితో కలిసి లకనాపురం యువకులపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం సీఐ దాశరథి గ్రామస్థులతో మాట్లాడారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్రిక్తత తలెత్తకుండా గ్రామస్తులు చర్యలు తీసుకోవాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details