హాథ్రస్ అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా విజయనగరం బాలాజీ జంక్షన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు శాంతియుతంగా సత్యాగ్రహం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు పాల్గొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్ అధికార యంత్రాంగం నేరస్థులను రక్షించే ప్రక్రియలో ఉందని... వారిని పట్టుకోకుండా ఎర్రతివాచి పరుస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హాథ్రస్ అత్యాచార ఘటన బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఈ విషయంపై యూపీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ శాంతియుత సత్యాగ్రహం - విజయనగరం తాజా వార్తలు
హాథ్రస్ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనకు విజయనగరంలో ఆ పార్టీ నాయకులు శాంతియుతంగా సత్యాగ్రహం కార్యక్రమం చేశారు. బాధితురాలికి యూపీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు