ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం సేకరణలో వేగం పెంచండి: కలెక్టర్ - district collector hari jawahar lal latest news

రైతులు త్వరగా పంటకోతలు పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రోత్సహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్​ సూచించారు. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.

district collector review
అధికారులతో జిల్లా కలెక్టర్​ సమీక్ష

By

Published : May 12, 2020, 1:02 PM IST

వచ్చే వారం రోజుల్లో జిల్లాలో రైతుల నుంచి 20 వేల టన్నుల ధాన్యం సేకరించాలని కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్.. పౌరసరఫరాల సంస్థ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ 300 టన్నుల ధాన్యం సేకరిస్తూ వచ్చే వారం రోజుల్లో మరింత వేగవంతం చేయాలని సూచించారు.

రబీ సీజన్లో ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఈ ఏడాది 30 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ లక్ష్యం చేరుకొనే విధంగా కృషి చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details