ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనాపై విజయనగరం.. విజయవంతం' - విజయనగరంలో అధికారులతో డీజీపీ సవాంగ్ సమీక్ష

ఇప్పటివరకు 4 కేసులు నమోదైనా.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో విజయనగరం జిల్లా యంత్రాంగం విజయవంతమైందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. విజయనగరంలో పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితిని పోలీసు అధికారులతో సమీక్షించారు.

dgp goutham sawang in vizianagaram tour
విజయనగరం జిల్లా పర్యటనలో డీజీపీ గౌతం సవాంగ్

By

Published : May 10, 2020, 7:06 PM IST

Updated : May 10, 2020, 7:11 PM IST

విజయనగరం పర్యటనలో భాగంగా.. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి.. లాక్ డౌన్ అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్-19 వైరస్​ను నివారించడంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఉద్యోగిలా కాకుండా పోలీసులు ప్రజలకు సేవ చేసే సంస్థల్లాగా ఉండాలని సూచించారు.

కరోనాను నియత్రించేందుకు ప్రతి ఒక్క పోలీస్ అంకితభావంతో పనిచేశారని.. ఇకముందు అలాగే ఉంటూ ప్రజలు క్షేమంగా ఉండేలా చూడాలని ఆకాంక్షించారు. వలసదారుల రాకతో జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో జిల్లా పోలీస్ శాఖ విజయవంతమైందని ప్రశంసించారు.

Last Updated : May 10, 2020, 7:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details