విజయనగరం జిల్లాలోని సాలూరు పట్టణంలో నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన కోటను కూల్చివేశారు. ఈ కోట 21 బురుజులతో ఒడిశా గజపతులకు స్థావరంగా ఉండేది. శిథిలావస్థకు చేరిన కారణంగా.. కోటను తొలగించాలంటూ పురపాలక అధికారులు నోటీసులు జారీ చేసినట్లు జమీందారి కుటుంబీకుడు విక్రమ చంద్ర సన్యాసిరాజు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో కోటను కూల్చేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాలూరులోని ప్రాచీన కోట కూల్చివేత - salur fort latest news
విజయనగరం జిల్లాలోని సాలూరు పట్టణంలో ఉన్న జమీందారుల కాలం నాటి కోటను కూల్చివేశారు. ఈ కోటకు నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది.
సాలూరు కోట కూల్చివేత