ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిందితులపై చర్యలు తీసుకోవాలని విజయనగరంలో ఆందోళన

By

Published : Jul 10, 2020, 3:19 PM IST

విజయనగరంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముంబయిలోని బీ.ఆర్. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Concerns in Vijayanagaram for taking action against accused
నిందితులపై చర్యలు తీసుకోవావలంటూ విజయనగరంలో ఆందోళన

ముంబయిలోని డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఇంటిపై దుండగుల దాడిని ఖండిస్తూ.. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత హాక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గృహ ధ్వంసానికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనపై కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఇంటిని ఆధునీకీకరించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details