ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోగాపురం వ్యవసాయశాఖ కార్యాలయంలో చోరీ - computer stolen in bogapuram agriculture office news

బిర్యానీ తినేందుకు వచ్చిన కొందరూ యువకులు చోరీకి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరిగింది. సుమారు 80వేల రూపాయలు విలువ చేసే కంప్యూటర్, ల్యాప్​టాప్, టాబ్​ తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

computer and laptop stolen in bogapuram agriculture office
computer and laptop stolen in bogapuram agriculture office

By

Published : Oct 25, 2020, 11:49 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో చోరీ జరిగింది. రహదారిని అనుకుని ఉండే ఈ కార్యాలయంలో ఎప్పటిలాగే సిబ్బంది.. విధులు ముగించుకుని తలుపులకు తాళాలు వేసి వెళ్లారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మద్యం తాగిన కొంత మంది యువకులు....బిర్యానీ తినేందుకు ఐసీడీఎస్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడే బిర్యానీ తిని... కంప్యూటర్, ల్యాప్​టాప్​, టాబ్ తీసుకెళ్లారు. సుమారు 80వేల విలువైన వస్తువులను తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details