ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీలకు చెందిన జెండాల రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేధు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో రైతు భరోసా కేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు ఆశాదేవిని వివరణ అడగ్గా... రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలకు ఇవే రంగులు వేస్తున్నారని చెప్పారు. వైకాపా జెండా రంగులకు.. వీటికి తేడా ఉందన్నారు.
కోర్టు తీర్పు బేఖాతరు.. మళ్లీ రంగు పడింది! - ప్రభుత్వ కార్యాలయలకు వైకాపా రంగులు వేయడంపై తీర్పు
విజయనగరం జిల్లా ద్వారపూడిలో రైతు భరోసా కేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయటం విమర్శలకు తావిస్తొంది. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా.. వైకాపా జెండా రంగులకు, ఈ రంగులకు తేడా ఉందని సెలవిచ్చారు.
![కోర్టు తీర్పు బేఖాతరు.. మళ్లీ రంగు పడింది! Colors resemble the ysrcp flag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7092500-793-7092500-1588819132183.jpg)
రైతు భరోసా కేంద్రానికి వైకాపా రంగులు