విజయనగరం జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 31 స్థానాలకు ఈనెల 8న ఎన్నికలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వివరాలను వెల్లడించారు.
జడ్పీటీసీ స్థానాలకు..
31 జడ్పీటీసీ స్థానాలకు 129 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో వైకాపా నుంచి 31 మంది, తెదేపా నుంచి 28, కాంగ్రెస్ నుంచి 25, భాజపా నుంచి 14, బీఎస్పీ నుంచి 4, జనసేన 10 మంది.. సీపీఎం నుంచి 3, స్వతంత్రులు 14 మంది పోటీలో ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు.
ఎంపీటీసీ స్థానాలకు..
ఇక 549 ఎంపీటీసీ స్థానాలకు గాను 55 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 494 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ స్థానాలకు 1189 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో వైకాపా నుంచి 491మంది, తెదేపా నుంచి 453, కాంగ్రెస్ నుంచి 29, భాజపా నుంచి 34, బీఎస్పీ నుంచి 12, జనసేన 24 మంది, సీపీఎం నుంచి 20, సీపీఐ నుంచి ఇద్దరు, స్వతంత్రులు 123 మంది పోటీలో ఉన్నారు. 8 స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.