ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామతీర్థం ఘటనకు నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన చలో రామతీర్థం - vizianagaram latest news

రామతీర్థం ఘటనపై ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల అయిదో తేదీన భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఛలో రామతీర్థం కార్యక్రమం చేపడతామని తెలిపారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Chalo Ramatirtha on the fifth of this month to protest of the Ramatirtha inciden
రామతీర్థం ఘటనకు నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన చలో రామతీర్థం

By

Published : Jan 3, 2021, 10:58 PM IST

రామతీర్థం ఘటనను నిరసిస్తూ... ఈ నెల అయిదో తేదీన భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఛలో రామతీర్థం కార్యక్రమం చేపడతామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరవుతారని తెలిపారు. రామతీర్థం సంఘటన జరిగిన తరువాత ముఖ్యమంత్రి జగన్... జిల్లాకు వచ్చి కూడా ఎందుకు మాట్లాడలేదని మాధవ్ విమర్శించారు. దేవాదాయశాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు... వైకాపా కార్యకర్తలుగా వ్యవహరించారని ఆక్షేపించారు. పుణ్యక్షేత్రం అయిన రామతీర్థంను రాజకీయ క్షేత్రంగా భ్రష్ఠు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details