ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2021, 7:03 PM IST

ETV Bharat / state

మొక్కజొన్న రైతు సేవలో.. ఆర్టీసీ కార్గో వాహనాలు

సరుకులను రవాణా చేసేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో వాహనం ఇప్పుడు మొక్కజొన్న రైతులకు సేవలందిస్తోంది. విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలను లోడ్​ చేసేందుకు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు.

cargo vehicle
కార్గొ వాహనంలో జొన్న బస్తాలు నింపుతున్న రైతులు

ఆర్టీసీ కార్గో వాహనాలను ఇప్పటివరకూ సరుకు రవాణాకు ఉపయోగించారు. కర్ఫ్యూ కారణంగా ఇప్పుడు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలను కార్గో వాహనంలో లోడ్​ చేశారు. పూసపాటిరేగ వద్ద ఉన్న ప్రైవేట్ పరిశ్రమకు తమ పంటను తరలించేందకు రైతులు ఈ వాహనాలను ఉపయోగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details