విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖ వెళ్లే బస్సులో ఓ మైనర్ బాలుడు నుంచి ఏడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ఆపకుండా వేగంగా వెళ్ళిపోతూ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంబడించి కారులో తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న విశాఖ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.
గంజాయి అక్రమ రవాణా.. ఆరుగురు అరెస్టు - cannabis trafficking in vizianagaram news
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గురువారం మూడు వేరు వేరు చోట్ల జరిగిన దాడుల్లో 23 కిలోల గంజాయి పట్టుకున్నారు.

గంజాయి పట్టివేత
ఇదే చెక్పోస్ట్ వద్ద అరకు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మొత్తంగా మూడు కేసుల్లో 23 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు.. మైనర్ బాలుడితో సహా ఆరుగురిని రిమాండ్కు తరలించారు. మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి...