రాములవారి విగ్రహం ధ్వంసంపై భాజపా, తెదేపా నేతలతో పాటు హిందూ దార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిందితులను పట్టుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా దాడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు.
రెండేళ్లలో సుమారు 125 దాడులు : అయ్యన్నపాత్రుడు
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగి, పవిత్రమైన రామతీర్థం పుణ్యక్షేత్రంలో కోదండ రాముడి విగ్రహంపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లలో సుమారు 125 దాడులు జరగడం దారుణమన్నారు.
'అసలు సంగతి ఏమిటో చెప్పాలి ??'
ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పందించకపోవడం వెనుక అసలు కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పర్యటనకు వచ్చినప్పడు సైతం రామతీర్థం ఘటనపై సీఎం స్పందించక పోవడం విచారకమన్నారు. పశ్చిమ బంగలో ఇదే విధంగా ఓ ఘటన జరిగితే.. అక్కడ ఉన్నతాధికారులపై కేంద్రం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఏపీలో ఆ పరిస్థితి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. ఏపీ డీజీపీపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని సందేహం వ్యక్తం చేశారు. తక్షణమే డీజీపీని రీకాల్ చేయాలన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం : భాజపా నేతలు