విజయనగరం జిల్లా కురుపాం మండలం పి. లేవిడి గ్రామంలో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోటిపల్లి అప్పారావు రోడ్డు మీద నడుస్తుండగా ఒక్కసారిగా బైక్ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి - లేవిడి గ్రామంలో బైక్ ఢీకొని వ్యక్తి మృతి
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పి. లేవిడి గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
![ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి bike hit the person and he died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6668705-889-6668705-1586069019824.jpg)
లేవిడి గ్రామంలో బైక్ ఢీకొని వ్యక్తి మృతి