ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శృంగవరపుకోటలో ఆటో బోల్తా... వ్యక్తి మృతి - శృంగవరపుకోటలో ఆటో బోల్తా

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శృంగవరపుకోటలో ఆటో బోల్తా... వ్యక్తి మృతి
శృంగవరపుకోటలో ఆటో బోల్తా... వ్యక్తి మృతి

By

Published : Apr 14, 2021, 6:56 AM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆటో బోల్తా పడి శివరామరాజు పేటకు చెందిన శ్రీనివాసరావు మృతి చెందాడు. శ్రీనివాసరావు.. ఎస్ కోట పట్టణంలో పండ్ల రసాల దుకాణం నడుపుతున్నాడు. ప్రతి రోజు ఉదయం వచ్చి రాత్రి ఇంటికి తిరిగి వెళ్తాడు. మంగళవారం రాత్రి పని పూర్తి చేసుకోని సొంత ఆటోలో ఇంటికి వెళ్తుండగా అంబటి వారి కల్లాలు మలుపు సమీపంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును ఎస్.కోట సామాజిక ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details