ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చరవాణితో లఘుచిత్రాలు.. అందరిచేత ప్రశంసలు - సెల్​ఫోన్​తో లఘుచిత్రాల చిత్రీకరణ

'రమణా లోడెత్తాలిరా' అంటూ... చరవాణితోనే లఘుచిత్రాలు తీస్తూ అబ్బురపరుస్తున్నాడా యువకుడు. చిత్రీకరణ, ఎడిటింగ్ స్మార్ట్‌ఫోన్‌లోనే చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. నటనలో అనుభవం లేనివారితో పంచ్‌డైలాగ్‌లు చెప్పించి... లఘుచిత్రాల దర్శకుడిగా నూతన పంథాతో ఆకట్టుకుంటున్నాడు విజయనగరం జిల్లాకు చెందిన బూర్ల గణేశ్‌.

article on short film maker boorla ganesh
చరవాణితో లఘుచిత్రాలు.. అందరిచేత ప్రశంసలు

By

Published : Oct 29, 2020, 5:00 PM IST

Updated : Oct 29, 2020, 8:21 PM IST

చరవాణితో లఘుచిత్రాలు.. అందరిచేత ప్రశంసలు

చూడటానికి అచ్చం సినిమా స్థాయి సాంకేతికతలాగానే అనిపిస్తున్న దృశ్యాలను చరవాణితో చిత్రీకరించారంటే నమ్మగలరా? లఘు చిత్రం తీయాలంటే కనీసం తక్కువ ధరలో లభించే వీడియో కెమెరా అయినా ఉండాలి. ఇవేమీ లేకుండానే సినిమా తరహాలో... డబ్బింగ్, మ్యూజిక్‌తో పాటు ఎడిటింగ్‌ స్మార్ట్ ‌ఫోన్‌తోనే చేస్తూ... విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్లకు చెందిన బూర్ల గణేశ్‌ అబ్బురపరుస్తున్నాడు.

చదువుపై ఆసక్తి లేక ఎనిమిదో తరగతిలోనే చదువుకు స్వస్తి పలికి.. తర్వాత దూరవిద్యలో పదో తరగతి పూర్తిచేశాడు గణేశ్. ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌పై ఆసక్తితో హైదరాబాద్‌లోని బీఎఫ్​ఎక్స్​లో చేరాడు. కరోనా పరిస్థితులతో స్వస్థలానికి వచ్చాడు. నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు... ఓ చిత్రంలోని పోరాట దృశ్యాలపై చేసిన లఘుచిత్రం గణేశ్‌ను ఆకర్షించింది. తాను కూడా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు.

నటనలో అనుభవం లేకపోయినా.... గ్రామంలోని 20 మందిని ఎంపిక చేసి లఘుచిత్రం తీశాడు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని పోరాట దృశ్యాన్ని ఎంపిక చేసుకుని వారం రోజుల్లోనే పూర్తిచేశాడు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ లఘుచిత్రాన్ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. వీక్షించిన తమ కుటుంబసభ్యులు, స్నేహితులు అందరూ మెచ్చుకుంటున్నారని ఇందులో నటించినవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ దదవండి:

కరోనా సుడిగుండంలో గంగపుత్రుల జీవన నావ!

Last Updated : Oct 29, 2020, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details