ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితులు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇప్పిస్తా

''విజయనగరం సంస్థానాన్ని అందంగా తీర్చిదిద్దుతా. సహజవనరులను ఉపయోగించుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది.. వలసలు ఆగిపోయేలా చేస్తా'': విజయనగరం ప్రచారంలో జనసేనాని పవన్

By

Published : Apr 5, 2019, 5:33 PM IST

ఎన్నికల ప్రచారంలో పవన్

విజయనగరంలో జనసేనాని

విజయనగరం ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్ హామీల వర్షం కురిపించారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది వలసలు ఆగిపోయేలా చేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న 3 జూట్ మిల్లులు తెరిపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంస్థ ఆస్తులు అమ్మైనా.. బాధితులు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేలా చేస్తామని వెల్లడించారు. జిల్లాకు పరిశ్రమలు తేవడంలో విఫలమైతే యువతకు భృతి కల్పించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తామని వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details