ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP CRIME NEWS: పోరురాజు తిరునాళ్లలో అపశృతి.. ఆర్టీసీ బస్సు కింద పడి బాలుడు మృతి

By

Published : Mar 1, 2022, 3:48 AM IST

Updated : Mar 1, 2022, 10:03 AM IST

ap crime news : రాష్ట్రంలో పలు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు.

ap crime news :
ap crime news :

విశాఖ జిల్లా కల్యాణపులోవలో పోరురాజు తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. రావికమతం మండలం కల్యాణపులోవలో ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి బాలుడు మృతి చెందాడు. బాలుడు మాకవరపాలెం మండల వాసి రోహిత్‌(5)గా గుర్తించారు.

రెండు లారీలు ఢీ

విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్తం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన సాంబయ్యగా గుర్తించారు.

ఎక్సైజ్ ఎస్ఐ మృతి

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో ఎక్సైజ్ ఎస్ఐ మృతి చెందారు. మృతుడు తెనాలి ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరావుగా గుర్తించారు.

ఇదీ చదవండి:AP Crime News: అనంత జిల్లా రౌడీషీటర్​ హత్య కేసు.. ముగ్గురు నిందితులు అరెస్ట్​

Last Updated : Mar 1, 2022, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details