తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో విజయనగరం విద్యార్థి సాయితేజ్ ప్రతిభ చాటాడు. మొదటి స్థానంలో నిలిచాడు. తమ కుమారుడికి మొదటి ర్యాంకు రావడంపై సాయితేజ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ సైన్స్లో ఇంజినీర్ కావాలని ఉందని ముంబై ఐఐటీలో సీఎస్ఈ చదవాలని ఉందని మెుదటి ర్యాంకర్ సాయితేజ్ తెలిపారు.
తెలంగాణ ఎంసెట్: విజయనగరం విద్యార్థికి మొదటి ర్యాంక్ - తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మొదటి ర్యాంకర్
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన సాయితేజ్ మొదటి ర్యాంక్ సాధించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే ఈ ర్యాంకు సాధ్యమైందని వెల్లడించారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో విజయనగరం విద్యార్థికి మొదటి ర్యాంక్
నారాయణ కళాశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో మంచి ఫలితం సాధించానని పేర్కొన్నారు. అతని తల్లిదండ్రులు విజయనగరంలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.