ఎటువంటి అనుమతులు లేకుండా మాంగనీస్ ఖనిజాన్ని తరలిస్తున్న లారీలను విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు పట్టుకున్నారు. పీఎస్ లక్ష్మీపురం సమీపంలో పోలీసుల తనిఖీలలో అక్రమ తరలింపును గుర్తించారు. పెద్ద నడిపల్లి మైన్స్ పేరుతో 2 లారీలు, కొత్త కర్రలో మైనింగ్ పేరుతో 4 నాలుగు లారీలను పట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మాంగనీస్ గనుల్లో తవ్వకాలు నిలిపివేశారు. కానీ నియోజకవర్గంలో మాత్రం అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. అధికారులు దృష్టిపెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసుల తనిఖీల్లో అక్రమ మైనింగ్ గుట్టురట్టు - taniki
విజయనగరం జిల్లా పీఎస్ లక్ష్మీపురంలో మాంగనీస్ ఖనిజాన్ని అక్రమంగా తరిలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు.

లారీల పట్టివేేత
పోలీసుల తనిఖీల్లో అక్రమ మైనింగ్ గుట్టురట్టు
ఇది కూడా చదవండి.