ఇసుక కొరత వల్ల కొన్ని నెలలు, కరోనా కారణంగా మరికొన్ని నెలలు పనులు లేక భవన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని... భవన కార్మిక సంఘం జిల్లా సెక్రెటరీ ఆల్తి చినమారయ్య పేర్కొన్నారు. భవన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. భవన కార్మికులకు పది వేలు ఆర్ధిక సాయం చేయాలని నినాదాలు చేశారు.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ ధర్నా - విజయనగరంలో భవన నిర్మాణ కార్మికుల తాజా వార్తలు
ఇసుక కొరత వల్ల కొన్ని నెలలు, కరోనా కారణంగా మరికొన్ని నెలలు పనులు లేక భవన కార్మికులు నష్టపోయారని... వారిని ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. భవన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ ధర్నా