ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ... విజయనగరంలో ఏఐఎస్ఎఫ్ ధర్నా చేపట్టింది. వెనకబడిన తరగతులకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల వసతి గృహాలను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.