విజయనగరం పైడితల్లి అమ్మవారికి పూసపాటి వంశీయురాలు అదితి గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు.ప్రతిసంవత్సరం సారె అందించటం పూసపాటి వంశీయుల అనవాయితీ.అశోక్ గజపతి రాజు ఆనారోగ్యం కారణంగా రాలేనందున,ఆయన చిన్న కుమార్తె అదితి గజపతి రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆమెకు ఆలయ పురోహితులు,అధికారులు సాదర స్వాగతం పలికారు.విజయనగరంజిల్లా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అదితి గజపతిరాజు తెలిపారు.
పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అదితి గజపతి రాజు