విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ నాగులాపల్లిలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్న దొడ్డి వెంకట అరవింద్(26) మూడు రోజుల క్రితం అనకాపల్లి వచ్చాడు.
అనకాపల్లిలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య - vishaka district
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ నాగులాపల్లి వీధిలో చోటు చేసుకుంది.
![అనకాపల్లిలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7990133-235-7990133-1594491740202.jpg)
అనకాపల్లిలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆన్లైన్లో జూదం ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి సిఐ భాస్కర రావు తెలిపారు
ఇదీ చదవండిప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు కచ్చితంగా పాటించాలి- ఆర్డీవో