హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రానంత మాత్రన న్యాయస్థానాల పట్ల తమకు గౌరవం పోదని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. రమేశ్ కుమార్ తొలగింపును తెదేపా, భాజపా రాజకీయాలు చేశాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ అనేది పార్టీలకు అతీతంగా పని చేయాలని కానీ... నిమ్మగడ్డ రమేశ్ పక్షపాతి ధోరణితో వ్యవహరించారని అన్నారు. ఎస్ఈసీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. న్యాయస్థానాలపై తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు ఎవరూ ఉండరని విమర్శించారు.
నోటీసులు ఇంకా అందలేదు..