ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ బ్రాండ్ ఇమేజ్​ను చంద్రబాబు దెబ్బ తీయాలని చూస్తున్నారు'

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖను పట్టించుకోలేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ విమర్శించారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేస్తుంటే తెదేపా నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

By

Published : Aug 20, 2020, 2:55 PM IST

ycp mla gudivada amarnath fires on tdp about vishaka
చంద్రబాబు విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని చూస్తున్నారు

తెదేపా అధికారంలో ఉండగా విశాఖకు ఏమి న్యాయం చేశారని వైకాపా అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు చేసిన ఏ ఒక్క ఆరోపణపైనైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన విశాఖను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details