ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2019, 7:39 PM IST

ETV Bharat / state

తల్లీ బిడ్డను దూరం చేసిన డెంగీ

పుట్టిన బిడ్డను కనులారా చూడకుండానే ఆ తల్లి కన్నుమూసింది. ప్రాణాంతక డెంగీ ఆ తల్లీ బిడ్డలను విడదీసింది. తమ ఇంట బాబు పుట్టాడన్న సంతోషాన్ని ఆ కుటుంబ సభ్యులకు అంతలోనే దూరమయ్యేలా చేసింది. విశాఖ జిల్లా దుర్గవానిపాలెంలో డెంగీతో ఓ బాలింత మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.

డెంగీ జ్వరంతో బాలింత మృతి

డెంగీ జ్వరంతో బాలింత మృతి

విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దుర్గవానిపాలెంలో సిందూప్రియ అనే బాలింత డెంగీ జ్వరంతో మృత్యువాత పడింది. సోమవారం ప్రసవించిన ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. బాబు క్షేమంగా ఉన్న సింధు మాత్రం డెంగీతో బాధపడుతూ చనిపోయింది. బాలింత మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఇంట బాబు పుట్టాడన్న ఆనందం అంతలోనే ఆవిరైందని కన్నీరు మున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details