ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2020, 3:21 PM IST

ETV Bharat / state

సీలేరులో వెబ్​ సినిమా చిత్రీకరణ

విశాఖ మన్యం సీలేరులో వర్ధమాన నటుడు యజుర్వేద్​ గుర్రం.. కథానాయకుడిగా వెబ్​ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. 12 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు దర్శకుడు కాశీ చెప్పారు.

shooting start at sileru
సీలేరులో వెబ్​ సినిమా చిత్రీకరణ ప్రారంభం

విశాఖ మ‌న్యం సీలేరులో ఓటీటీ వెబ్ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. వ‌ర్థ‌మాన న‌టుడు య‌జుర్వేద్ గుర్రం హీరోగా న‌టిస్తున్నాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌ద్ద స‌హాయ‌ ద‌ర్శ‌కునిగా ప‌నిచేసిన కాశీ.. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీలేరు ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌నివారం నుంచి రెండు రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుందని దర్శకుడు కాశీ చెప్పారు. క‌న్న‌డ హీరోయిన్ రజితా ఇంద్ర కథానాయికగా న‌టిస్తున్నారు. య‌జుర్వేద్ గ‌తేడాది విడుద‌లైన రాజావారు... రాణీగారు చిత్రంలో రెండో హీరోగా న‌టించారు. ప్రేమ క‌థ నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేద‌ని ద‌ర్శ‌కుడు కాశీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details