ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 20, 2020, 8:41 PM IST

ETV Bharat / state

అనకాపల్లిలో వ్యాపారుల స్వచ్ఛంద లాక్​డౌన్​.. నిర్మానుష్యంగా రోడ్లు

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాపారులు పాక్షికంగా లాక్​డౌన్​ పాటించారు.

Volunteer lockdown of traders in Anakapalle
అనకాపల్లిలో వ్యాపారుల స్వచ్ఛంద లాక్​డౌన్​

రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం విశాఖ జిల్లా అనకాపల్లిలో వ్యాపారులు పాక్షిక లాక్​డౌన్ పాటించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. పాక్షిక లాక్​డౌన్ పాటిస్తామని వ్యాపారులు ఆర్డీఓని కలిసి విన్నవించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాపారులు స్వయంగా ముందుకొచ్చి పాక్షిక లాక్​డౌన్ నిర్వహిస్తామని చెప్పి అమలు చేయడం విశేషం. దుకాణాలు మూసేయడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఇవీ చూడండి...

మృతుడిని చూడటానికి వెళ్లారు..ఇప్పడు ఆందోళనలో ఉన్నారు..!

ABOUT THE AUTHOR

...view details