ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుషికొండ రేవ్ పార్టీ మాదకద్రవ్యాల కేసు నిందితుడికి ముందస్తు బెయిల్ - rishi konda beach

విశాఖలో సంచలం సృష్టించిన రుషికొండ బీచ్ రేవ్ పార్టీ మాదకద్రవ్యాల కేసులో నిందితుడైన బి.నరేంద్ర కుమార్​కు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్​ను హైకోర్టు మంజూరు చేసిందని ఆరిలోవ పోలీసులు తెలిపారు.

రుషికొండ రేవ్ పార్టీ నిందితుడికి ముందస్తు బెయిల్

By

Published : May 9, 2019, 6:35 AM IST

ఈ కేసు దర్యాప్తు సంబంధించి నిందితుడు నరేంద్ర కుమార్ ప్రతి ఆదివారం ఆరిలోవ స్టేషన్​లో సంతకం చేయాలని, కేసు దర్యాప్తులో సహకరించాలని కోర్టు తెలిపింది.

ఏప్రిల్ 13న రుషికొండ బీచ్​లో కొంతమంది వ్యక్తులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నిషేధిత మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కేసును విచారణ జరుపుతున్న ఆరిలోవ పోలీసులు నిందితుడు నరేంద్ర వాగ్మూలం నమోదు చేసి, విడుదల చేశారు.

అశోక్ కుమార్ సి.ఐ ఆరిలోవ

నరేంద్ర వాగ్మూలం ఈ కేసులో కీలక ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. మాదకద్రవ్యాలు నగరానికి ఎలా వచ్చాయి. ఎవరెవరు వినియోగించారన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి :ఎన్నికల తర్వాత జాతీయ టైగర్​గా మమతా: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details