ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'క్రీడాప్రాంగణానికి కేటాయించిన భూమి రద్దు నిర్ణయం సరికాదు' - ఎమ్మెల్యే గణబాబు వార్తలు

విశాఖలో క్రీడాప్రాంగణ నిర్మాణానికి తెదేపా హయాంలో కేటాయించిన స్థలాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ప్రాజెక్ట్ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీఎం జగన్​కు విజ్ఞప్తి చేశారు.

vizag mla ganababu letter to cm jagan
గణబాబు, ఎమ్మెల్యే

By

Published : Aug 17, 2020, 1:48 PM IST

విశాఖ గోపాలపట్నం అగనంపూడిలో క్రీడాప్రాంగణం నిర్మాణానికి తెదేపా హయాంలో కేటాయించిన స్థలాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. ప్రభుత్వం నిర్ణయంపై ఓ క్రీడాకారుడిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని క్రీడాపోటీలకు ఉపయోగపడేలా 150 ఎకరాల్లో ప్రాంగణం నిర్మించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించిందన్నారు. ఇప్పటికే 80 ఎకరాలు సేకరించి శాప్​కు అప్పగించారని.. మరో 70 ఎకరాలు కేటాయించి ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరారు. ప్రాజెక్ట్ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details