ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో ఘనంగా మారెమ్మ ఉత్సవాలు - seeleru latest news

విశాఖ మన్యంలో మారెమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుమారు వంద మంది భక్తులు అగ్నిగుండంలో నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.

vishakha maremma ustvalu
విశాఖ మన్యంలో ఘనంగా మారెమ్మ ఉత్సవాలు

By

Published : Apr 18, 2021, 6:47 AM IST

విశాఖ మ‌న్యంలోని గూడెం కొత్త‌వీధి మండ‌లం సీలేరులో మారెమ్మ అమ్మ‌వారి ఉత్స‌వాల్లో భాగంగా అగ్నిగుండం గ‌ర‌గాలంక‌ర‌ణ కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రిగింది. సుమారు వంద‌మందికి పైగా భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

మ‌న్యంలో ప్ర‌సిద్ధి గాంచిన మారెమ్మ అమ్మ‌వారి ఉత్స‌వాలు బుధ‌వారం ప్రారంభం కాగా ఉత్స‌వ‌మూర్తిని ఆల‌యంలోకి తీసుకువ‌చ్చే కార్య‌క్ర‌మం శ‌నివారం సాయంత్రం జ‌రిగింది. సీలేరు న‌ది ఒడ్డున ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి అమ్మ‌వారిని అలంక‌రించారు. ఆల‌య ప్రాంగ‌ణంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు.

ABOUT THE AUTHOR

...view details