ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు

వెంకటాపురం ప్రజలను స్టైరీన్ విషవాయువు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎన్ని చర్యలు చేపడుతున్నా.. దాని ప్రభావం స్థానికులపై పడుతూనే ఉంది. తాజాగా పలువురు గ్రామస్థులు స్పృహ తప్పిపడిపోవడమే ఇందుకు ఉదాహరణ.

By

Published : May 13, 2020, 3:35 PM IST

Updated : May 13, 2020, 6:04 PM IST

vishaka gas leakage impact on venkatapuram people
vishaka gas leakage impact on venkatapuram people

వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు

దేశం మెుత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన.. విశాఖ గ్యాస్​ లీకేజ్ ఘటన నుంచి ఇంకా స్థానికులు తేరుకోలేదు. మళ్లీ విషవాయువు ప్రభావం చూపిస్తోంది. గ్రామంలో ఇప్పటికీ.. పలువురు స్పృహ తప్పిపడిపోతున్నారు. తాజాగా వెంకటాపురంలో ఇల్లు తూడుస్తూ కరణ జ్యోతి అనే మహిళ కుప్పకూలి పడిపోయింది. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

గ్యాస్​ లీకేజ్ ఘటనతో ఇప్పటికే 12 మంది మృతి చెందారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు.. గ్యాస్ లీకేజ్ పరిసర గ్రామాల్లో మంత్రులు ఒక్కరోజు రాత్రి బస చేశారు. మళ్లీ విషవాయువు ప్రభావం చూపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:విషవాయువు కమ్మేసింది.. గుండెల్ని మెలిపెడుతోంది

Last Updated : May 13, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details