ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్రం నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్ల పరిధి' - vishaka collector spoke corona news

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వివిధ కమిటీలు తమ పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీకి ఇస్తాయని, వాటిపైనే తదుపరి చర్యలు ఉంటాయని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్​చంద్ వెల్లడించారు. కొవిడ్ కేసుల కోసం కంటైన్మెంట్ జోన్ల పరిధి... కేంద్రం నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

speaking vishaka district collector
మాట్లాడుతున్న విశాఖ జిల్లా కలెక్టర్

By

Published : May 20, 2020, 8:38 PM IST

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వివిధ కమిటీలు తమ పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీకి ఇస్తాయని, వాటిపైనే తదుపరి చర్యలు ఉంటాయని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వెల్లడించారు. బాధిత గ్రామస్ధులందరికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి క్రమపద్దతిలో రికార్డు నిర్వహణకోసం ప్రత్యేకంగా కార్డులు ఇస్తామన్నారు. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ నీటిని తుది నివేదికలు వచ్చే వరకు వినియోగించబోమని స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల కోసం కంటైన్మెంట్ జోన్ల పరిధి... కేంద్రం నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని వివరించారు. రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం హాజరుకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే ఆయా విభాగాధిపతులను అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.

ఇదీచూడండి:ఎల్జీ పాలిమర్స్​కు ఎకరా కూడా కేటాయించలేదు: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details