ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తాగునీటి సరఫరా కేంద్రాల వద్ద ఇళ్ల స్థలాలు కేటాయింపులు వద్దు'

తాగునీటిని సరఫరా చేసే నీటి కేంద్రాల వద్ద ఇళ్ల స్థలాలు కేటాయింపు వద్దంటూ విశాఖ జిల్లా చోడవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటి కేంద్రాల వద్ద నివాసాలు ఏర్పాటయితే , ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితం అవుతుందని తెదేపా నేత​ గూనూరు మల్లు నాయుడు తెలిపారు.

By

Published : Dec 28, 2020, 9:20 PM IST

people demand not to give house sites at water works place at visakhapatnam
తెదేపా నేత​ గూనూరు మల్లు నాయుడు

పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే నీటి కేంద్రాల వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించడంపై విశాఖ జిల్లా చోడవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటి కేంద్రాల వద్ద నివాసాలు ఏర్పాటయితే , ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితం అవుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు వాటర్ వర్క్స్ స్థలాన్ని పరిరక్షించుకుందాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్​ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

తెదేపా నేత​ గూనూరు మల్లు నాయుడు

ABOUT THE AUTHOR

...view details