ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 23, 2020, 1:49 PM IST

ETV Bharat / state

'ఇళ్ల స్థలాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి'

ఇళ్ల స్థలాల సేకరణ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య... అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని పలు గ్రామాలను ఆయన పరిశీలించారు.

Sub Collector Narapureddy Maurya
ఇళ్ల స్థలాల సేకరణా ప్రక్రియను వేగవంతం చేయండి

ఇళ్ల స్థలాల సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం రాచపల్లి, తుతిపాల, బురుగుపాలెం, వెంకటాపురం తదితర గ్రామాల్లోని ఇళ్ల స్థలాల ప్రక్రియను పరిశీలించారు.

గ్రామా సచివాలయ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గడువులోగా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి అన్ని పనులు పూర్తి కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తహశీల్దార్ రాణీ అమ్మాజీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details