ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2020, 4:14 PM IST

ETV Bharat / state

సీఎం సహాయనిధి ద్వారా ఎంపీ సత్యనారాయణ ఆర్థిక సాయం

కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి విశాఖ ఎంపీ సత్యనారాయణ సీఎం సహాయనిధి కింద ఆర్థిక సాయం చేశారు. ఆరుగురికి 2.52లక్షల విలువైన చెక్కును అందించారు.

visakha mp sathyanarayana financial help to people in visakha dst
visakha mp sathyanarayana financial help to people in visakha dst

విశాఖ ఎంపీ సత్యనారాయణ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనారోగ్యాల నిమిత్తం చేరి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయ సహకారాలు అందజేశారు. విశాఖ లా సన్స్ బే కాలనీ ఎంపీ కార్యాలయంలో రూ. 2.52 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్ చెక్కులను ఆరుగురు లబ్ధిదారులకు అందజేశారు. రేసపువానిపాలానికి చెందిన పూసర్ల వెంకటేశ్వరరావుకి 1లక్ష, వినాయక నగర్​కి చెందిన ఉప్పాడ రమణమ్మకి 55 వేలు, రాజీవ్ నగర్​కి చెందిన మల్లూరి నారాయణ రావుకి 40 వేలు, ఎంవీపీ కాలనీకి చెందిన కొర్రా ప్రభావతికి 25 వేలు, పండా వీధికి చెందిన నాయన ఉపేంద్రకి 17 వేలు, గాజువాకకు చెందిన పైడి మాదాన్స్ నివాస్​కి 15 వేలు చెక్కులను వారికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details