ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా..!

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆపార్టీ నియోజకవర్గ నేతలు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులు అందజేశారు.

By

Published : Oct 20, 2020, 8:07 PM IST

visakha janasena party leadersvisakha janasena party leaders
మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి నిత్యావసరాలు అందజేత

విశాఖ జిల్లా నాతవరం మండలం మాధవ నగరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబానికి నియోజకవర్గ జనసేన పార్టీ నేతల ఆధ్వర్యంలో మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులను ఉచితంగా అందజేశారు. గ్రామానికి చెందిన మధ్య నానాజీ అనే జనసేన పార్టీ కార్యకర్త ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుని కుటుంబానికి జనసేన నేతలు బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ రాజా, సూర్య చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details