విశాఖ ఐఐఎం విద్యార్థులు 100 శాతం ప్లేస్మెంట్ దక్కించుకున్నారు. అత్యధిక వేతనంతో ఐఐఎం విద్యార్ధులను నియమించుకునేందుకు వివిధ కంపెనీలు ఉత్సాహం చూపెట్టాయి. అత్యధిక పారితోషికం రెండు లక్షలు కాగా.. సగటు పారితోషికంగా లక్షా 17 వేల రూపాయిలను నెలకు ఇవ్వనున్నారు. ప్రతి ఏటా వేసవిలో పరిమిత కాలానికి వీరంతా వివిధ కంపెనీలతో పని చేయాల్సి ఉంటుంది.
ఈ సారి మాత్రం కంపెనీలే అత్యధిక వేతనంతో ఐఐఎం విద్యార్ధులను నియమించుకునేందుకు ఉత్సాహం చూపి పోటీ పడ్డాయి. అత్యధిక పర్సంటైల్ సాధించిన పదిమందికి సగటున లక్షా 46వేల రూపాయిల పారితోషికం లభించనుంది. ఇది గతేడాది సగటుతో పోలిస్తే దాదాపు 62,264 రూపాయలు ఎక్కువ. కనీసం 20.4 శాతం మేర ఈ పారితోషిక శ్రేణి పెరిగిందని ఐఐఎం విశాఖపట్నం వెల్లడించింది.