ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూరగాయల మార్కెట్​ స్థలం మార్పు.. రద్దీ తగ్గింపునకే! - visakha dst anakapalli gandhi rythu market shifted to NTR stadium

ప్రజలను బయటకు రావద్దని ఎంత చెప్పినా వినటం లేదు. నిత్యావసరాల కొనుగోలుకు ప్రజలు బయటికి రాక తప్పడం లేదు. ఈ మేరకు కరోనా వైరస్​ ప్రబలకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు ప్రత్యామ్నాయాలు పాటిస్తున్నారు.

visakha-dst-anakapalli-gandhi-rythu-market-shifted-to-ntr-stadium
visakha-dst-anakapalli-gandhi-rythu-market-shifted-to-ntr-stadium

By

Published : Mar 25, 2020, 12:13 PM IST

Updated : Mar 26, 2020, 9:25 AM IST

అనకాపల్లి కూరగాయల మార్కెట్​ను మార్చిన అధికారులు

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్ని కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల విషయంలో ఇబ్బందులెదురవుతున్నాయి. సామాజిక దూరం పాటించాల్సిన ప్రజలు వస్తువులను కొనటం కోసం ఎగబడుతున్నారు. వారిని కట్టడి చేయటానికి అనకాపల్లిలోని గాంధీ కూరగాయల మార్కెట్​ను ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులోకి మార్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు.

Last Updated : Mar 26, 2020, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details