ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి'

తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనుకున్నారు పూర్వ విద్యార్థులు. మహనీయుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని భావించారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం.. సర్ధార్​ వల్లభ్​ భాయ్​ పటేల్​ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

By

Published : Jun 29, 2019, 12:44 PM IST

పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విప్

వల్లాభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విప్...

విశాఖ జిల్లాలోని ఖండివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సర్దార్ వల్లభ్​ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ముత్యాల నాయుడు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుల కృషితో మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details