ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రొయ్యల వ్యర్థాలను పొలాల్లోకి వదులుతున్నారంటూ గ్రామస్థుల ఆందోళన - వల్లూరులో గ్రామస్థుల ఆందోళన

రొయ్యల కంపెనీలోని వ్యర్థాలను పొలాల్లోకి వదిలిపెడుతున్నారంటూ విశాఖ జిల్లా వల్లూరు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వాటివల్ల దుర్వాసన వస్తోందని.. రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని ఆరోపించారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

villagers protest in valluru vizag district
రొయ్యల వ్యర్థాలను పొలాల్లోకి వదులుతున్నారంటూ ఆందోళన

By

Published : Jul 11, 2020, 3:36 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వల్లూరులో నిలిటో మెరెన్స్ ప్రాన్స్ కంపెనీ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆ కంపెనీ వారు వ్యర్థాలను పొలాల్లోకి వదిలిపెడుతున్నారని ఆరోపించారు. సముద్రంలో పట్టిన రొయ్యలు తీసుకొచ్చి వాటిని ఈ సంస్థలో శుభ్రం చేసి ప్యాకింగ్ చేస్తుంటారు.

ఈ క్రమంలో వచ్చిన వ్యర్థాలను గ్రామ సమీపంలోని పొలాల్లో విడిచిపెట్టడం వల్ల దుర్వాసన వస్తోందంటూ స్థానికులు నిరసన తెలిపారు. తమకు అనారోగ్యం సోకే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details