ఆరోగ్యంగా ఉండాలని చేసే వ్యాయామంలో భాగంగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళలో నడుస్తుంటారు. విశాఖలోని సాగర్నగర్లో బసచేస్తున్న వెంకయ్య.. తన మిత్రుడు, ఆచార్య అశోక్తో కలిసి సుమారు 45 నిమిషాలుపాటు నడక సాగించారు.
సాగర్నగర్ ఫుట్పాత్పై వెంకయ్యనాయుడు మార్నింగ్ వాక్
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు.. తన మిత్రుడు అశోక్తో కలిసి విశాఖలోని సాగర్నగర్ ఫుట్పాత్పై బుధవారం ఉదయం నడక సాగించారు. ఆయన విశాఖ వచ్చిన సందర్భంగా ప్రస్తుతం సాగర్నగర్లో బసచేస్తున్నారు.
సాగర్నగర్ ఫుట్పాత్పై నడుస్తున్న వెంకయ్యనాయుడు
'నడక అలవాటు ఉండటం వల్లే తాను కొవిడ్ బారినుంచి వేగంగా కోలుకోగలిగానని... ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్లే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నాన'ని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: