ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... వినూత్న ప్రచారం

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో... మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం జోరుగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలు మున్సిపాలిటీల్లో బలాన్ని చూపించుకోవాలని తాపత్రయ పడుతుండగా.. ప్రతిపక్ష పార్టీలు పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నాయి.

By

Published : Feb 27, 2021, 2:05 PM IST

municipal election campaign
మున్సిపల్ ఎన్నికలు

అనకాపల్లిలో అట్లు వేసి...

విశాఖ జిల్లా అనకాపల్లిలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. వైకాపా నేతలు వినూత్నంగా ప్రచారం చేశారు. 83వ వార్డు వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిని జాజుల ప్రసన్న లక్ష్మి.. ప్రచారంలో భాగంగా, ఓ టిఫిన్ సెంటర్ వద్ద అట్లు వేసి ఓట్లు అభ్యర్థించారు.

కర్నూలులో..

కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపించాలని... తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఇంటి పన్ను పెరగకూడదంటే.. కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలన్నారు. తెదేపాను గెలిపిస్తే.. నీటి సమస్య పరిష్కారం కోసం రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ప్రకాశం జిల్లాలో..

అద్దంకిలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. నేతలు ఇంటింటికీ తిరుగుతూ.. తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

అనంతపురంలో...

పురపాలక ఎన్నికలకు సమన్వయంతో పని చేసి.. తెదేపాకు విజయం సాధిస్తామని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త బీటీ రవి అన్నారు. పార్టీ అధిస్థానం సూచన మేరకు ప్రచారం నిర్వహించి.. అధిక స్థానాల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'మహా' విజయవాడకు మోక్షమెప్పుడో..?

ABOUT THE AUTHOR

...view details